తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- April 30, 2021
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వెంటనే కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ.. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు... DHMOలకు ఆదేశాలు జారీ చేశారు.అయితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను వినియోగించుకునే వీలు కల్పించింది.మిగతా వ్యాక్సిన్ లను వెంటనే సేకరించాలని హెల్త్ డైరెక్టర్ ఆదేశించారు.కాగా, జనవరి 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది.ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ జరుగుతుండగా.. రేపటి (మే 1వ తేదీ) నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది.కానీ, ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం..వ్యాక్సిన్ల కొరత ఇప్పటికే వెంటాడుతున్నందున 18+ వయస్సు వాళ్లకు వ్యాక్సిన్ సాధ్యం కాదంటున్నారు.మరోవైపు.. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం









