తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- April 30, 2021హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వెంటనే కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ.. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు... DHMOలకు ఆదేశాలు జారీ చేశారు.అయితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను వినియోగించుకునే వీలు కల్పించింది.మిగతా వ్యాక్సిన్ లను వెంటనే సేకరించాలని హెల్త్ డైరెక్టర్ ఆదేశించారు.కాగా, జనవరి 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది.ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ జరుగుతుండగా.. రేపటి (మే 1వ తేదీ) నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది.కానీ, ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం..వ్యాక్సిన్ల కొరత ఇప్పటికే వెంటాడుతున్నందున 18+ వయస్సు వాళ్లకు వ్యాక్సిన్ సాధ్యం కాదంటున్నారు.మరోవైపు.. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ