ఫుడ్ పాయిజనింగ్: మక్కాలో రెస్టారెంట్ మూసివేత

- April 30, 2021 , by Maagulf
ఫుడ్ పాయిజనింగ్: మక్కాలో రెస్టారెంట్ మూసివేత

సౌదీ అరేబియా: ఫుడ్ పాయిజన్ కారణంగా 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ మరియు విలేజ్ ఎఫైర్స్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై విచారణ ప్రారంభించారు. నెల రోజుల పాటు సదరు రెస్టారెంట్ మూసివేయబడ్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో పలు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఎప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com