భారతదేశం నుంచి విమానాలపై సిఎఎ ప్రకటన

- May 01, 2021 , by Maagulf
భారతదేశం నుంచి విమానాలపై సిఎఎ ప్రకటన

మస్కట్: సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఒమన్ మరియు ఇండియా మధ్య విమాన సర్వీసులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఒమన్ పౌరులు తిరిగొచ్చేందుకు అలాగే అత్యవసర సేవల నిమిత్తమే విమానాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాజాగా సలాలా విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కేవలం ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే వున్నట్లు సిఎఎ వెల్లడించింది. కోచి నుంచి ఈ విమానం బయల్దేరింది. ఇండియా నుంచి ప్రయాణీకులపై బ్యాన్ విధించిన దరిమిలా, ప్రయాణీకుల సంఖ్య తక్కవుగా వుంది. ఇండియాతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపైనా బ్యాన్ విధించింది సుప్రీం కమిటీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com