600 ఆక్సిజన్ సిలిండర్లను భారత్ కు పంపిన ఐసీఎస్జీ
- May 02, 2021కువైట్ సిటీ: భారత్ కు తమ వంతు సాయంగా కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ 600 ఆక్సిజన్ సిలిండర్లను పంపుతోంది. ఈ మేరకు ఆక్సిజన్ సిలిండర్లను కువైట్లోని భారత రాయబార కార్యాలయానికి ఐసీఎస్జీ అందజేసింది. ఈ సిలిండర్లను భారత్ కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు..వారం రోజుల్లో భారత్ కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అంచనాలకు మించి కోవిడ్ పేషెంట్లు ఆస్పత్రికి పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే..అనూహ్య సంఖ్యలో కోవిడ్ పేషెంట్లు రావటంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో చాలామంది సరైన చికిత్స అందక ఊపిరివదిలారు. ఈ హృదయవిదారక పరిస్థితులతో ప్రపంచదేశాలు చలించిపోయాయి. ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..