600 ఆక్సిజన్ సిలిండర్లను భారత్ కు పంపిన ఐసీఎస్జీ
- May 02, 2021
కువైట్ సిటీ: భారత్ కు తమ వంతు సాయంగా కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ 600 ఆక్సిజన్ సిలిండర్లను పంపుతోంది. ఈ మేరకు ఆక్సిజన్ సిలిండర్లను కువైట్లోని భారత రాయబార కార్యాలయానికి ఐసీఎస్జీ అందజేసింది. ఈ సిలిండర్లను భారత్ కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు..వారం రోజుల్లో భారత్ కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అంచనాలకు మించి కోవిడ్ పేషెంట్లు ఆస్పత్రికి పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే..అనూహ్య సంఖ్యలో కోవిడ్ పేషెంట్లు రావటంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో చాలామంది సరైన చికిత్స అందక ఊపిరివదిలారు. ఈ హృదయవిదారక పరిస్థితులతో ప్రపంచదేశాలు చలించిపోయాయి. ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







