600 ఆక్సిజన్ సిలిండర్లను భారత్ కు పంపిన ఐసీఎస్జీ
- May 02, 2021కువైట్ సిటీ: భారత్ కు తమ వంతు సాయంగా కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ 600 ఆక్సిజన్ సిలిండర్లను పంపుతోంది. ఈ మేరకు ఆక్సిజన్ సిలిండర్లను కువైట్లోని భారత రాయబార కార్యాలయానికి ఐసీఎస్జీ అందజేసింది. ఈ సిలిండర్లను భారత్ కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు..వారం రోజుల్లో భారత్ కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అంచనాలకు మించి కోవిడ్ పేషెంట్లు ఆస్పత్రికి పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే..అనూహ్య సంఖ్యలో కోవిడ్ పేషెంట్లు రావటంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో చాలామంది సరైన చికిత్స అందక ఊపిరివదిలారు. ఈ హృదయవిదారక పరిస్థితులతో ప్రపంచదేశాలు చలించిపోయాయి. ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!