'రాధేశ్యామ్' కూడా ఓటీటీలో చూడాలసిందేనా?!
- May 03, 2021ఒకప్పుడు ఓటీటీ అంటే ఏంటో కూడా కొందరికి తెలియని పరిస్థితి. కాని ఇప్పుడు కరోనా పరిస్థితులలో చాలా మంది సినీ ప్రియులు ఓటీటీపై మక్కువ చూపిస్తున్నారు. థియేటర్స్ తెరవకపోవడం, ఓపెన్ చేసిన కరోనా వలన వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు. ఇక నిర్మాతలు సైతం రిలీజ్కు సిద్దంగా ఉన్న సినిమాలను పెండింగ్ పెట్టడం ఇష్టం లేక ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
ప్రభాస్- పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారని ప్రచారం నడుస్తుంది. జూలై 30న రాధే శ్యామ్ మూవీని థియేటర్లో విడుదల చేస్తాం అని మేకర్స్ ప్రకటించారు. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ సమయానికి థియేటర్స్ తెరవడం కష్టంగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో ‘రాధేశ్యామ్’ సినిమాను పే పర్ వ్యూ విధానంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కాగా, పే పర్ వ్యూ విధానంతో.. సల్మాన్ ఖాన్ రాధే: ది మోస్ట్ వాంటెడ్ బాయ్ సినిమాను మే 13న విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసిందే.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు