కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ సస్పెండ్
- May 04, 2021ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేసింది ట్విట్టర్. ఆదివారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కంగన అభ్యంతరకర ట్వీట్లు చేయడం వల్లే ఆమె అకౌంట్ను సస్పెండ్ చేశారు. ఇది ట్విటర్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కంగనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఓ రాక్షసిగా అభివర్ణించారు.
పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేసింది. అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా అక్కడ హింస చెలరేగలేదని, పశ్చిమ బెంగాల్లో మాత్రం టీఎంసీ హింసకు దిగుతోందని కంగనా ట్వీట్ చేసింది. బెంగాల్ మంటల్లో కాలిపోతోందంటూ కంగనా ట్వీట్ చేయడంపై ట్విటర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన ట్వీట్లలో ఇందిరా గాంధీపై కూడా ఆమె పలు కామెంట్లు చేసింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ