కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ సస్పెండ్
- May 04, 2021
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేసింది ట్విట్టర్. ఆదివారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కంగన అభ్యంతరకర ట్వీట్లు చేయడం వల్లే ఆమె అకౌంట్ను సస్పెండ్ చేశారు. ఇది ట్విటర్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కంగనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఓ రాక్షసిగా అభివర్ణించారు.
పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేసింది. అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా అక్కడ హింస చెలరేగలేదని, పశ్చిమ బెంగాల్లో మాత్రం టీఎంసీ హింసకు దిగుతోందని కంగనా ట్వీట్ చేసింది. బెంగాల్ మంటల్లో కాలిపోతోందంటూ కంగనా ట్వీట్ చేయడంపై ట్విటర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన ట్వీట్లలో ఇందిరా గాంధీపై కూడా ఆమె పలు కామెంట్లు చేసింది.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







