హోటళ్ళలో ఆక్యుపెన్సీ పెరుగుదల: క్వారంటైన్ ఎఫెక్ట్
- May 04, 2021
దోహా: తప్పనిసరి హోటల్ క్వారంటైన్ నేపథ్యంలో హోటళ్ళలో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో ట్రావెల్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2020 నాలుగో త్రైమాసికంలో 49 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యింది. యావరేజ్ డెయిలీ రేట్లు.. ఒక రూమ్ కోసం 537 ఖతారీ రియాల్స్ అలాగే, అందుబాటులో వున్న రూము రెవెన్యూ 263 ఖతారీ రియాల్స్ నమోదైంది. ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు తప్పనిసరి హోటల్ క్వారంటైన్ నిబంధన విధించిన దరిమిలా హోటళ్ళలో రూములు నిండుతున్నాయి. 10 రోజుల క్వారంటైన్ విధిస్తున్నారు ప్రయాణీకులకి. కాగా, ల్యాడ్ ట్రాన్సాక్షన్ టికెట్ రేటు అత్యధికంగా అల్ మషాఫ్ ప్రాంతంలో 70 మిలియన్ ఖతారీ రియాల్స్ నమోదయ్యింది. అల్ వుకైర్ - వక్రా మునిసిపాలిటీలో ల్యాండ్ ట్రాన్సాక్షన్ చదరపు అడుగుకి 200 నుంచి 250 ఖతారీ రియాల్స్ ధర పలుకుతోంది. దోహా పరిసరాల్లోని కొన్ని మునిసిపాలిటీల్లో చదరపు అడుగుకి 140 ఖతారీ రియాల్స్ 300 ఖతారీ రియాల్స్ వరకు ధర పలుకుతోంది.
తాజా వార్తలు
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!









