తొలగింపు నుంచి 16,000 మంది ఒమనీయులకి ఊరటనిచ్చిన మినిస్ట్రీ
- May 04, 2021
ఒమన్: 90కి పైగా కంపెనీలతో చర్చించి 16,000 మందికి పైగా ఒమనీ కార్మికులకి తొలగింపు నుంచి ఊరట కలిగించినట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. మినిస్ట్రీ విడుదల చేసిన తొలి త్రైమాసిక రిపోర్టులో ఈ వివరాలున్నాయి. 21,000 మందికి పైగా ఒమనీయులు తమ ఉద్యోగాల్ని నిలుపుకోగలిగారు.వేతనాల్లో తగ్గింపులు, తొలగింపుల నుంచి వీరంతా ఉపశమనం పొందారు. 58 సంస్థలతో చర్చించి 16,671 మందికి ఊరట కలిగించగా, 15,386 మంది తిరిగి తమ ఉద్యోగాలు పొందగలిగారు. వేతనాల తగ్గింపు విషయమై 33 సంస్థలతో చర్చించి 9,212 మంది ఒమనీ కార్మికులకు ఊరట కలిగించారు. అందులో 6,142 మంది సేలరీ తగ్గింపు నుంచి ఉపశమనం పొందారు. జాబ్ సెక్యూరిటీ విధానం ద్వారా 5,711 మంది వర్కర్లు మేలు పొందారు.
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







