ఏపీలో కర్ఫ్యూ షురూ...
- May 05, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ మొదలైంది.మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు జరుగుతుంది.మధ్యాహ్నం 12 గంటల తరువాత షాపులు బంద్ చేశారు.12 గంటల తరువాత షాపులను వ్యాపారాలు స్వచ్చందంగా మూసివేయగా,రోడ్డుపైకి వచ్చిన ప్రజలకు చెప్పి వెనక్కి పంపుతున్నారు.అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను కూడా తిరిగి వెనక్కి పంపుతున్నారు.ఈరోజు వరకు ప్రజల్లో అవగాహనా కల్పిస్తామని, రేపటి నుంచి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తామని చెప్తున్నారు పోలీసులు.మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.రాత్రి సమయంలో నైట్ కర్ఫ్యూ, ఉదయం సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉండటం విశేషం.మొత్తం మీద 18 గంటలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు