పోలీసుల కోసం ఆరోగ్య పర్యవేక్షణ కమిటీలు: టి.డీజీపీ మహేందర్ రెడ్డి
- May 05, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు కమిషనర్ల కార్యాలయాలు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ల కార్యాలయంలో ఆరోగ్య పర్యవేక్షణ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. బుధవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా డీజీపీ ఈ నిర్ణయం వెలువరించారు. పోలీసు సిబ్బంది భద్రత కోసం ఈ విభాగం ప్రాధాన్యతనిస్తోందన్నారు. వారిలో విశ్వాసం, సానుకూలత పెంపొందించేందుకు జూమ్ సమావేశాల ద్వారా వారితో సంభాషించడానికి ప్రతి విభాగంలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ బృందంలోని రోగులకు సీనియర్ అధికారులు,స్టేషన్ హౌస్ అధికారులు, వైద్యులు తగిన సలహా ఇస్తారన్నారు.అదేవిధంగా కొవిడ్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. పోలీసు విభాగంలోని ప్రతి ఒక్క సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించిన డీజీపీ ఏవైనా సమస్యలు ఎదురైతే రోగులను సమీప ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









