34 మందితో తమిళనాడు క్యాబినెట్... గవర్నర్ ఆమోదం
- May 06, 2021
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతోంది. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మంత్రివర్గాన్ని రూపొందించారు. తనతో కలిపి 34 మంది మంత్రుల జాబితాను స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు పంపారు. గవర్నర్ ఈ జాబితాను లాంఛనంగా ఆమోదించారు. భావి సీఎం స్టాలిన్ సిఫారసులకు రాజముద్ర వేశారు.కాగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి కూడా మంత్రివర్గంలో స్థానం లభించనుందని గత కొన్నిరోజులుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, స్టాలిన్ గవర్నర్ కు పంపిన జాబితాలో ఉదయనిధి పేరు లేదు. ఇక, స్టాలిన్ సాధారణ పరిపాలన సహా పలు శాఖలను తన వద్ద ఉంచుకుంటున్నట్టు తెలుస్తోంది. స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..







