45 ఏళ్లకు పై బడిన వారికి వ్యాక్సిన్..వ్యాక్సినేషన్ పై ఒమన్ కీలక నిర్ణయాలు
- May 07, 2021
ఒమన్: ఆరోగ్య శాఖలోని వైద్య నిపుణుల బృందం జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై చర్చించింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ లో మరో పది లక్షల వ్యాక్సిన్ డోసులు సుల్తానేట్ కు చేరుకుంటాయని, దీంతో జూన్ నెల చివరినాటికి వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య 15 లక్షలకు చేరుకుంటుందని నిపుణల బృందం ప్రకటించింది. తమ తొలి సమావేశంలో సుల్తానేట్ పరిధిలోని ప్రజల రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూలకశంగా డిస్కస్ చేశారు. లక్ష్యంగా ఎంచుకున్న వర్గాలతో పాటు 45 ఏళ్లు, అంతకు పైబడిన వారికి కూడా వ్యక్సిన్ అందించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే భక్తులు, పౌరులు, ముసాండం గవర్నరేట్ పౌరులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగులు, రాయల్ ఒమన్ పోలీస్, సుల్తాన్ సాయుధ దళాలు, ఉన్నత విద్య, విద్యా సిబ్బంది, పాఠశాలల్లో పన్నెండవ తరగతి విద్యార్థులు, చమురు, గ్యాస్ పరిశ్రమలో కీలక రంగాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు మరియు అనేక ప్రైవేటు రంగ సంస్థలు ఇలా అన్ని వర్గాల వారికి వ్యాక్సిన్ అందుతుందన్నారు. ఇందుకోసం సల్తానేట్లోని ఒమన్ కన్వేన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్ తో పాటు పలు పలు క్రీడా ప్రాంగణాలు, స్కూల్ ప్రాంతాలను సంసిద్ధం చేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







