ఇపుడు జన్మించిన శిశువు వయస్సు 12 ఏళ్ళు మాత్రమె
- March 04, 2016
' కలిసొచ్చిన కాలానికి....నడిచొచ్చిన కొడుకు పుట్టేడని ' మన తెలుగునాట ఓ సామెత ఉంది. అచ్చంగా అలానే జరిగింది మన దేశానికి పొరుగున ఉన్న చైనా లో .... ఈ వార్త వివరాలలోనికి వెళితే, ఫలదీకరణ చేసి దాచబడిన ఓ అండం ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం సంరక్షించబడిన టెస్ట్ ట్యూబ్ బేబీ రూపంలో జన్మించింది. చైనా దేశానికి చెందిన ఒక మహిళ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ,ఇతర సంతానోత్పత్తి సమస్యలకు బాధపడుతోంది. దీంతో ఆమె 2003 లో పిండాలను శీతలీకరణ ప్రక్రీయ ద్వారా స్తంభింప నిర్ణయించుకుంది. ఆ సమయంలో వైద్యులు 12 అండాలను తన భర్త వీర్యంతో ఫలదీకరణ చేశారు. ఆమెలో ప్రవెశ పెట్టిన పిండాల జంటలో అమర్చిన తర్వాత ఆమెకు ఒక మగ శిశువు పుట్టింది. మిగిలిన ఆమె పిండాలను తిరిగి వైద్యులు భద్రపర్చారు. ప్రస్తుతం చైనాలో ' ఒక బిడ్డ ముద్దు ....రెండోవ బిడ్డ వద్దు ' అనే నిబంధనను కొద్దిగా సడలించారు.దీంతో ఒక పుష్కర కలం తర్వాత రెండవ బిడ్డను ఆ మహిళ కనింది. 12 ఏళ్ళ తర్వాత ఘనీభవించిన పిండం శిశువుగా ( రెండో కుమారుడుగా ) జన్మించడంతో సంచలనం కల్గించందని..ఈ సందర్భంలో సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్న అనేక జంటలు లక్షలాది ఆశ కిరణంగా మారిందని చైనా పత్రిక నివేదించింది..
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







