ఇపుడు జన్మించిన శిశువు వయస్సు 12 ఏళ్ళు మాత్రమె
- March 04, 2016
' కలిసొచ్చిన కాలానికి....నడిచొచ్చిన కొడుకు పుట్టేడని ' మన తెలుగునాట ఓ సామెత ఉంది. అచ్చంగా అలానే జరిగింది మన దేశానికి పొరుగున ఉన్న చైనా లో .... ఈ వార్త వివరాలలోనికి వెళితే, ఫలదీకరణ చేసి దాచబడిన ఓ అండం ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం సంరక్షించబడిన టెస్ట్ ట్యూబ్ బేబీ రూపంలో జన్మించింది. చైనా దేశానికి చెందిన ఒక మహిళ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ,ఇతర సంతానోత్పత్తి సమస్యలకు బాధపడుతోంది. దీంతో ఆమె 2003 లో పిండాలను శీతలీకరణ ప్రక్రీయ ద్వారా స్తంభింప నిర్ణయించుకుంది. ఆ సమయంలో వైద్యులు 12 అండాలను తన భర్త వీర్యంతో ఫలదీకరణ చేశారు. ఆమెలో ప్రవెశ పెట్టిన పిండాల జంటలో అమర్చిన తర్వాత ఆమెకు ఒక మగ శిశువు పుట్టింది. మిగిలిన ఆమె పిండాలను తిరిగి వైద్యులు భద్రపర్చారు. ప్రస్తుతం చైనాలో ' ఒక బిడ్డ ముద్దు ....రెండోవ బిడ్డ వద్దు ' అనే నిబంధనను కొద్దిగా సడలించారు.దీంతో ఒక పుష్కర కలం తర్వాత రెండవ బిడ్డను ఆ మహిళ కనింది. 12 ఏళ్ళ తర్వాత ఘనీభవించిన పిండం శిశువుగా ( రెండో కుమారుడుగా ) జన్మించడంతో సంచలనం కల్గించందని..ఈ సందర్భంలో సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్న అనేక జంటలు లక్షలాది ఆశ కిరణంగా మారిందని చైనా పత్రిక నివేదించింది..
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









