గూగుల్ ఉద్యోగులకు శుభవార్త..
- May 07, 2021
కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కు అలవాటు పడ్డారు. అయితే లాక్డౌన్ను దశలవారీగా ఎత్తేయడంతో చాలా వరకు కంపెనీలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు పరిగెత్తడం మొదలుపెట్టారు. అయితే కొన్ని సంస్థలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఎక్కువ లాభాలను గడించాయి. దీంతో ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను ఇస్తూ వస్తున్నాయి.
ఈ జాబితాలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఉంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తమ సంస్థలోని ఉద్యోగులకు గూగుల్ ఒక గుడ్ న్యూస్ను చెప్పింది. ఇకపై వారంలో మూడు రోజులు మాత్రమే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయొచ్చని, మిగతా రెండు రోజులు వారి ఇష్టమని స్పష్టం చేసింది. ఉద్యోగులు కావాలంటే ఆ రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను ఎంచుకోవచ్చని గూగుల్ సంస్థ పేర్కొంది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయమని ఆ సంస్థ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించే సంస్థల్లో వారు తమ పూర్తి సామర్థ్యంతో పనులు చేస్తారని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









