గూగుల్ ఉద్యోగులకు శుభవార్త..
- May 07, 2021కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కు అలవాటు పడ్డారు. అయితే లాక్డౌన్ను దశలవారీగా ఎత్తేయడంతో చాలా వరకు కంపెనీలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు పరిగెత్తడం మొదలుపెట్టారు. అయితే కొన్ని సంస్థలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఎక్కువ లాభాలను గడించాయి. దీంతో ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను ఇస్తూ వస్తున్నాయి.
ఈ జాబితాలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఉంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తమ సంస్థలోని ఉద్యోగులకు గూగుల్ ఒక గుడ్ న్యూస్ను చెప్పింది. ఇకపై వారంలో మూడు రోజులు మాత్రమే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయొచ్చని, మిగతా రెండు రోజులు వారి ఇష్టమని స్పష్టం చేసింది. ఉద్యోగులు కావాలంటే ఆ రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను ఎంచుకోవచ్చని గూగుల్ సంస్థ పేర్కొంది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయమని ఆ సంస్థ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించే సంస్థల్లో వారు తమ పూర్తి సామర్థ్యంతో పనులు చేస్తారని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు