'ప్రాజెక్ట్ Z" సీక్వెల్
- May 07, 2021
హైదరాబాద్: యంగ్ హీరో సందీప్ కిషన్ బర్త్ డే నేడు.ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు నిర్మాతలు.ఈ క్రమంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'మాయావన్'కు సీక్వెల్ ను ప్రకటించారు.మేకర్స్. సి. వి. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా, జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ కీలకపాత్రలు పోషించారు.2017 డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మాయావన్' యావరేజ్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రాజెక్ట్ Z" పేరుతో డబ్ చేశారు. తెలుగులోనూ పెద్దగా స్పందన రాలేదు ఈ చిత్రానికి. తాజాగా 'మాయావన్' చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. తమిళంలో 'మాయావన్ రీలోడెడ్' అంటూ సినిమా టైటిల్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తిరుకుమారన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు సివి కుమార్ దర్శకత్వం వహించారు.ఈ సీక్వెల్ ను తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









