టీ -20 వరల్డ్ కప్ పై ఐసీసీ కీలక నిర్ణయం..
- May 07, 2021భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకి భారీగా కేసుల సంఖ్య పెరుగుతోంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక, ఈ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది.ముఖ్యంగా కరోనా కన్ను క్రీడా రంగంపై పడినట్లు ఉంది. ఇప్పటికే.. క్యాష్ రీచ్ లీగ్ కరోనా ప్రభావంతో నిరవధిక పడింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా టోర్నీలు రద్దయ్యాయ్.ఇప్పుడు, కరోనా మహమ్మారి కారణంగా పురుషుల టీ20 వరల్డ్ కప్లో భాగంగా మూడు సబ్-రీజినల్ క్వాలిఫయర్ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఈ రోజు ప్రకటించింది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ కోసం ఈ అర్హత టోర్నీలను నిర్వహిస్తోంది. అయితే, మూడు క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో ఎ, బి క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఫిన్లాండ్లో జరగనుండగా, వచ్చే రెండు నెలల్లో సి క్వాలిఫయర్స్కు బెల్జియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది.
కరోనా నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు క్వాలిఫయర్లను రద్దు చేయడమే మంచిదని నిర్ణయించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు టీ20 వరల్డ్కప్ అమెరికా క్వాలిఫయర్స్, ఆసియా క్వాలిఫయర్స్ టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్లో పాల్గొనే చివరి రెండు జట్లను ఈ టోర్నీ ద్వారా ఎంపికచేస్తారు.
మరోవైపు, ఈ ఏడాది భారత్ లో జరగాల్సిన టీ -20 ప్రపంచ కప్ తరలిపోయే అవకాశం ఉంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది ధనా ధన్ మెగా టోర్నీ యూఏఈలో జరిగే అవకాశం ఉంది. ఇక, ఐపీఎల్ లోని మిగిలిన మ్యాచ్ల్ని కూడా ప్రత్యామ్నాయ వేదికలపై నిర్వహించడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఐపీఎల్ నిర్వహించడానికి చాలా దేశాలు క్యూ కడుతున్నాయ్. మేం నిర్వహిస్తే.. మేం అంటూ ముందుకొస్తున్నాయ్.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!