తర్వాతి విడతలో మూడో డోసు వేయనున్నట్లు బహ్రెయిన్ ప్రకటన
- May 08, 2021
బహ్రెయిన్: కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించిన బహ్రెయిన్ లేటెస్ట్ గా...మూడో డోస్ కు సంబంధించిన ప్రణాళికను కూడా వెల్లడించింది. తర్వాతి విడత వ్యాక్సినేషన్ లో భాగంగా మూడో డోస్ కూడా అందించనున్నట్లు జాతీయ వైద్య బృందం ప్రకటించింది. మూడో డోస్ తో నిర్ణీత వర్గాలు సంపూర్ణ ప్రయోజనాలను పొందుతారని అభిప్రాయపడింది. 60 ఏళ్లు అంతకు మించి వయసున్న వారు..ఊబకాయులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి తొలి డోసు వేసుకున్న 6 నెలల తర్వాత మూడో డోస్ వేయనున్నట్లు జాతీయ వైద్య బృందం అధికారులు తెలిపారు. మిగిలిన పౌరులు, ప్రవాసీయులకు తొలి డోసు తర్వాత 12 నెలలకు మూడో డోసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మూడో డోసు పొందాలనుకునే వారు మెడికల్ ప్రోటోకాల్ అనుసరించి బీఅవేర్ యాప్ లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









