కరోనా పాజిటివ్ రిపోర్ట్ లేకున్నా ఆసుపత్రుల్లో చేరవచ్చు: కేంద్రం
- May 08, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది.రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారితో పాటు హోం ఐసోలేషన్లో ఉన్నవారి కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రుల్లో చేర్చుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదని తేల్చి చెప్పింది.ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా, శుక్రవారం హోం ఐసోలేషన్లో ఉన్నవారికి కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.హోం ఐసోలేషన్లో ఉన్నవారు 10 రోజుల తర్వాత బయటకు రావొచ్చని, చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే పరీక్ష అవసరంలేదని కేంద్రం జారీచేసిన కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!









