DRDO అద్భుతం..కోవిడ్కు మందు వచ్చేసింది..అత్యవసర అనుమతి మంజూరు చేసిన డీజీసీఐ
- May 08, 2021
కోవిడ్ మహమ్మారిని అరికట్టే క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలకమైన అడుగేసింది. కరోనా వైరస్కు కనిపెట్టిన మందుకు డీజీసీఐ అత్యవసర అనుమతి జారీ చేసింది.
కరోనా మహమ్మారిని (Corona Virus) అంతం చేసేందుకు నిరంతరం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే డీఆర్డీవో(DRDO), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(Dr Reddys Labs) సంయుక్తంగా ఢిల్లీలోని ఐఎన్ఎంఏఎస్ ల్యాబ్లో యాంటీ కరోనా డ్రగ్ను అభివృద్ధి చేశాయి.ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎల్లైడ్ సైన్సెస్ ల్యాబొరేటరీలో తయారైన ఈ మందు క్లినికల్ ట్రయల్స్ (Clinical trials) ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉండటంతో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ కోవిడ్ 2 డియోక్సీ డి గ్లూకోజ్( Covid 2 Deoxy De Glucose) మందుకు డీజీసీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగులకు ఈ మందు అమోఘంగా పనిచేస్తోందని..వేగంగా కోలుకోవడంతో పాటు ఆక్సిజన్పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని డీఆర్డీవో తెలిపింది.
ఈ మందు గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. దేశంలో దీన్ని సులభంగా ఉత్పత్తి చేయడంతో పాటు విరివిగా అందుబాటులో తీసుకురావచ్చని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(Dr Reddys labs) చెబుతోంది. ఈ మందు సాచెట్లలో పొడిరూపంలో లభించనుంది. నీటిలో కరిగించి నోటితో తీసుకోవాలి. వైరస్ వ్యాపించిన భాగాల్లో చేరి అక్కడి సెల్స్లో ఉన్న కరోనా శక్తిని అడ్డుకోవడంతో పాటు విస్తరణను గణనీయంగా తగ్గిస్తుంది. ఐఎన్ఎంఏఎస్ - డీఆర్డీవో శాస్త్రవేత్తలు సీసీఎంబీ (CCMB)సహాయంతో చేసిన ప్రయోగాల్లో వైరస్కు వ్యతిరేకంగా ఈ మందు సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు తేలింది. 2020 డిసెంబర్-2021 మార్చ్ మధ్య కాలంలో 220 మంది రోగులపై మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్లకు చెందిన 27 కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ ఫలితాల ఆధారంగా డీజీసీఐ (DGCI) అనుమతిచ్చింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







