85 శాతం ప్రైవేటు ట్యాక్సీలకు స్మార్ట్ మీటర్ల బిగింపు
- May 08, 2021
అజ్మన్ పబ్లిక్ రవాణా అథారిటీ, ప్రైవేటు ట్యాక్సీలకు 85 శాతం స్మార్ట్ మీటర్లను అమర్చే ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఏడాది చివరి నాటికి 100 శాతం స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తవుతుంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మీటర్ల ఏర్పాటు చేపట్టారు. పబ్లిక్ రవాణా కార్పొరేషన్ అండ్ యాక్టింగ్ లైసెన్సెస్ ఎపిటిఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరాహ్ అహ్మద్ అల్ హోసాని మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్లకు ఆప్టికల్ సెన్సార్లు వుంటాయని చెప్పారు. ప్రైవేటు ట్యాక్సీల వేగం తెలుస్తుంది వీటి ద్వారా. మ్యాపులు కూడా పొందుపరిచారు. ప్రయాణీకుల సేఫ్టీ మెకానిజం ఇందులో మరో ప్రత్యేకత. క్యాష్ పేమెంట్లను తగ్గించేలా వీటిని రూపొందించారు. రియల్ టైమ్ విధానంలో డేటా రవాణా జరుగుతుంది. కరోనా నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ పరిగననలోకి తీసుకుని పలు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









