85 శాతం ప్రైవేటు ట్యాక్సీలకు స్మార్ట్ మీటర్ల బిగింపు
- May 08, 2021
అజ్మన్ పబ్లిక్ రవాణా అథారిటీ, ప్రైవేటు ట్యాక్సీలకు 85 శాతం స్మార్ట్ మీటర్లను అమర్చే ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఏడాది చివరి నాటికి 100 శాతం స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తవుతుంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మీటర్ల ఏర్పాటు చేపట్టారు. పబ్లిక్ రవాణా కార్పొరేషన్ అండ్ యాక్టింగ్ లైసెన్సెస్ ఎపిటిఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరాహ్ అహ్మద్ అల్ హోసాని మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్లకు ఆప్టికల్ సెన్సార్లు వుంటాయని చెప్పారు. ప్రైవేటు ట్యాక్సీల వేగం తెలుస్తుంది వీటి ద్వారా. మ్యాపులు కూడా పొందుపరిచారు. ప్రయాణీకుల సేఫ్టీ మెకానిజం ఇందులో మరో ప్రత్యేకత. క్యాష్ పేమెంట్లను తగ్గించేలా వీటిని రూపొందించారు. రియల్ టైమ్ విధానంలో డేటా రవాణా జరుగుతుంది. కరోనా నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ పరిగననలోకి తీసుకుని పలు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







