ఐదుగురికి మించి గుమికూడొద్దు..దుబాయ్ హెచ్చరిక
- May 11, 2021
దుబాయ్: అసలే ఇది పండగ సమయం. దీంతో బంధువులు, ఆప్తులు, మిత్రులతో సంతోషంగా గడపాలనుకునే సమయం. కానీ, కోవిడ్ మహమ్మారి పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక సంతోషాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితువు చెబుతున్నారు దుబాయ్ పోలీసులు. భౌతిక దూరం పాటించకపోయినా..ఒకే చోట ఎక్కువ సంఖ్యలో గుమికూడిన దాని పరిణామాలు తీవ్రంగా మారే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇక రేపటి నుంచి ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రారంభం అవుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.ఒకే చోట ఐదుగురికి మించి ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడటంపై నిషేధం విధించింది. ఎవరైనా ప్రార్థనలు, సమావేశాల పేరుతో జనాలను కూడదీస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.నిషేధాన్ని ఉల్లంఘిస్తే కూటమికి ప్రధాన కారకుడికి 50 వేల దిర్హామ్ లు, అందులో పాల్గొన్న ఒక్కొక్కరికి 15,000 దిర్హామ్ ల చొప్పున జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









