ఐదుగురికి మించి గుమికూడొద్దు..దుబాయ్ హెచ్చరిక

- May 11, 2021 , by Maagulf
ఐదుగురికి మించి గుమికూడొద్దు..దుబాయ్ హెచ్చరిక

దుబాయ్: అసలే ఇది పండగ సమయం. దీంతో బంధువులు, ఆప్తులు, మిత్రులతో సంతోషంగా గడపాలనుకునే సమయం. కానీ, కోవిడ్ మహమ్మారి పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక సంతోషాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితువు చెబుతున్నారు దుబాయ్ పోలీసులు. భౌతిక దూరం పాటించకపోయినా..ఒకే చోట ఎక్కువ సంఖ్యలో గుమికూడిన దాని పరిణామాలు తీవ్రంగా మారే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇక రేపటి నుంచి ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రారంభం అవుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.ఒకే చోట ఐదుగురికి మించి ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడటంపై నిషేధం విధించింది. ఎవరైనా ప్రార్థనలు, సమావేశాల పేరుతో జనాలను కూడదీస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.నిషేధాన్ని ఉల్లంఘిస్తే కూటమికి ప్రధాన కారకుడికి 50 వేల దిర్హామ్ లు, అందులో పాల్గొన్న ఒక్కొక్కరికి 15,000 దిర్హామ్ ల చొప్పున జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com