ఏపీ-తెలంగాణ బోర్డర్‌: అంబులెన్సులకు ఆంక్షలు ఎత్తివేత

- May 11, 2021 , by Maagulf
ఏపీ-తెలంగాణ బోర్డర్‌: అంబులెన్సులకు ఆంక్షలు ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.దీంతో అనుమతి లేకుండా ఏపీ నుంచి వచ్చే కోవిడ్ పేషేంట్స్ పై తెలంగాణ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేశారు.ఏపీ అంబులెన్స్ లను నిలిపివేస్తుండటంతో పాటు.. కొన్నిసార్లు వెనక్కి తిప్పి పంపించారు.అయితే తాజాగా ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో అంబులెన్సులకు ఆంక్షలను తొలగించారు. నిన్న అర్ధరాత్రి నుంచి అంబులెన్సుల అనుమతిపై ఆంక్షలు ఎత్తివేశారు.ఇక ఎలాంటి ఆంక్షలు లేకుండానే తెలంగాణలోకి ఏపీ అంబులెన్సులు రానున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com