లాక్ డౌన్ కచ్చితంగా అమలు: సీపీ మహేష్ భగవత్
- May 12, 2021
హైదరాబాద్: నేటి ఉదయం 10 గంటల నుండి లాక్డౌన్ ఏర్పడిన నేపథ్యంలో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితిని ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్ పిఎస్ ల పరిధిలలోని చెక్ పోస్ట్ లను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించి పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ లో మొత్తం 46చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది మూడు షిప్టులలో పనిచేయనున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేళల్లో లాక్ డౌన్ కచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు.

లాక్ డౌన్ కి ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కోరారు. వ్యాపార సముదాయాలు ఉదయం పది గంటలకే మూసివేయాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రైతు బజార్, రేషన్ దుకాణాలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, షాపింగ్ మాల్స్ కి గుంపులుగా వెళ్లకూడదని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9490617234 కు ఫోన్ చేయాలని సీపీ కోరారు.

తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









