ప్రత్యేక దర్శనం పై టీటీడీ కీలక నిర్ణయం
- May 12, 2021
తిరుమల: కరోనా భయంతో భక్తులు తిరుమల వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న వేళ టీటీడీ వెసులుబాటు కల్పించింది.రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు పొందిన భక్తులకు దర్శనం తేదీని మార్చుకునే అవకాశం ఇచ్చింది.మే 31 వరకు టికెట్లు పొందిన వారు తేదీ మార్చుకోవచ్చని, ఏడాదిలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని సూచించింది.లాక్ డౌన్, కర్ఫ్యూతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పడిపోయింది.రోజుకు 15వేల టికెట్లు అందుబాటులో ఉన్నా స్వామివారి దర్శనానికి 3వేలలోపే వస్తుండటంతో ఈ మార్పు చేసింది.కాగా మంగళవారం 2,262 మంది భక్తులే స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. 925 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించింది.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









