పేదరికం లేని సమాజమే నా ఆశయం : చంద్రబాబు
- March 04, 2016
నరసరావుపేట, : నవ్యాంధ్ర అభివృద్ధికి ప్రజలు ఆలోచన చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని సిఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కోటప్పకొండ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సిఎం మాట్లాడారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సభకు అధ్యక్షత వహించారు.సిఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే తన ఆశయమని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రిగా నిలబెట్టారని,వారికి ఇచ్చిన వాగ్దానాలు రుణమాఫీ, డ్వాక్రా రుణాలకు చేయూత, పింఛన్ల పెంపు అమలు చేస్తున్నట్లు తెలిపారు.తెలుగువారికి శక్తితో పాటు తెలివితేటలు ఉన్నాయని, మట్టిలో మాణిక్యాలవలే ప్రపంచాన్ని తెలుగువారు శాశించే విధంగా విద్య నేర్పితే ఎదుగుతారని అన్నారు. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు నదుల అనుసంధానంతో పాటు రైతులకు సేద్యపు నీటి కుంటలను అమలు చేస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణా నదులను పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమ పాలనలో అద్భుతమైన రహదారులు ఉన్నాయని, విద్యుత్కోతలు లేవని అన్నారు. కేంద్రం నుండి నిధులు రాకున్నా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. దేవాలయాలు వారసత్వ సంపద అని, కోటప్పకొండను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.కోటప్పకొండకు ప్రస్తుతం వస్తున్న ఆదాను భవిష్యత్తును రూ.15,20 కోట్లకు పెంచే విధంగా పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామన్నారు. విభజన జరిగి రాష్ట్రం సమస్యల్లో ఉందన్నారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం అవినీతి పత్రిక ద్వారా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి బహిరంగ సభా కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.సభా వేదికపై సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో పాటు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్,జి.వి.ఆంజనేయులు, టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి, జెడ్పీ ఛైర్మన్ షేక్.జానీమూన్, కలెక్టర్ కాంతిలాల్ దండే, గ్రామీణ ఎస్పీ నారాయణనాయక్ తదితరులు బహిరంగ సభలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







