రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు
- March 04, 2016
రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శుక్రవారం రాజ్యసభలో ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ఏడు బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. పూర్తిస్థాయి నిర్ణయం జరిగాకా రైలు ప్రయాణిలకు బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. బీమా కావాలనుకునే ప్రయాణికులు టికెట్టు కొనే సమయంలోనే అదనపు రుసుంను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.ప్రశ్నోత్తరాల సమయంలో రైలు ప్రమాదాలపై అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానం తెలిపారు. 2012-13లో 123, 2013-14లో 118, 2014-15లో 135, 2015-16లో ఇప్పటివరకు 100 ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు. పరిహారం కోసం బాధితులు దాఖలు చేసిన 579 కేసులు వివిధ రైల్వే ట్రైబ్యునల్లో అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







