రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు
- March 04, 2016
రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శుక్రవారం రాజ్యసభలో ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ఏడు బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. పూర్తిస్థాయి నిర్ణయం జరిగాకా రైలు ప్రయాణిలకు బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. బీమా కావాలనుకునే ప్రయాణికులు టికెట్టు కొనే సమయంలోనే అదనపు రుసుంను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.ప్రశ్నోత్తరాల సమయంలో రైలు ప్రమాదాలపై అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానం తెలిపారు. 2012-13లో 123, 2013-14లో 118, 2014-15లో 135, 2015-16లో ఇప్పటివరకు 100 ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు. పరిహారం కోసం బాధితులు దాఖలు చేసిన 579 కేసులు వివిధ రైల్వే ట్రైబ్యునల్లో అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







