రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు

- March 04, 2016 , by Maagulf
రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు

 రైలు ప్రయాణికులకు బీమా రక్షణ కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శుక్రవారం రాజ్యసభలో ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ఏడు బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా వెల్లడించారు. పూర్తిస్థాయి నిర్ణయం జరిగాకా రైలు ప్రయాణిలకు బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. బీమా కావాలనుకునే ప్రయాణికులు టికెట్టు కొనే సమయంలోనే అదనపు రుసుంను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.ప్రశ్నోత్తరాల సమయంలో రైలు ప్రమాదాలపై అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానం తెలిపారు. 2012-13లో 123, 2013-14లో 118, 2014-15లో 135, 2015-16లో ఇప్పటివరకు 100 ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు. పరిహారం కోసం బాధితులు దాఖలు చేసిన 579 కేసులు వివిధ రైల్వే ట్రైబ్యునల్‌లో అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com