సినీ సంగీత దర్శకుడు కె.ఎస్.చంద్ర శేఖర్ మృతి
- May 12, 2021
హైదరాబాద్: ప్రముఖ రేడియో, సినిమా సంగీత దర్శకుడు కె.ఎస్.చంద్రశేఖర్ కరోనాతో మృతి చెందారు.ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1990 లో అల్ ఇండియా రేడియో ద్వారా విశాఖపట్నం వాసులకు సుపరిచితులయ్యారు. అల్లురామలింగయ్య నటించిన 'బంట్రోతు భార్య' తో నేపథ్యగాయకునిగా సినిమారంగ ప్రవేశంచేసిన ఈయన సంగీతదర్శకులు చక్రవర్తి వద్ద 70 కి పైగా చిత్రాలకు సహాయకునిగా పని చేసారు. ఆ తర్వాత రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు, బాలీవుడ్ లో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద కొంత కాలం సహాయకునిగా పనిచేసి గీతఆర్ట్స్ చిరంజీవితో నిర్మించిన 'యమకింకరుడు' చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'బ్రహ్మముడి', 'హంతకుడి వేట', 'ఆణిముత్యం', 'ఉదయం', 'అదిగో అల్లదిగో', 'భోళాశంకరుడు', 'ఆత్మ బంధువులు', 'కంచి కామాక్షి' వంటి 30 కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఇటీవల ఆలిండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. తిరుపతిలో ఈయన ప్రదర్శన చూసి ఘంటసాల హార్మోనియం బహుమతిగా అందించారు. కీరవాణి, కోటి, మణిశర్మ ఈయన దగ్గర శిష్యరికం చేయటం విశేషం. ఆయన మేనల్లుడు మహేంద్ర కూడా చిత్రపరిశ్రమలో మేనేజర్ గా, నిర్మాతగా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









