ఈద్ సెలవులు: మినిస్ట్రీ చేస్తున్న ఫుట్ పాట్రోలింగ్

- May 12, 2021 , by Maagulf
ఈద్ సెలవులు: మినిస్ట్రీ చేస్తున్న ఫుట్ పాట్రోలింగ్

ఖతార్: ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా ఫుట్ పెట్రోల్స్ తనిఖీలు ఎప్పటికప్పుడు జరుగుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ఎహ్తెరాజ్ యూనిట్ - నేషనల్ కమాండ్ సెంటర్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ మసౌద్ అల్ కహ్తానీ మాట్లాడుతూ, ఉల్లంఘనల్ని ఖచ్చితంగా గుర్తించి, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామన్ననారు. ఫేస్ మాస్కులు ధరించనివారిపై చర్యలు తప్పవన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్ని సమన్వయం చేసుకుని నిబంధనల్ని పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈద్ సెలవుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ భద్రతతోపాటు, ఇతరుల భద్రతను పరిగణనలోకి తీసుకుని తగు జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు. కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటించడం ప్రతి ఒక్కరి విధి అని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com