పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు..

- May 13, 2021 , by Maagulf
పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు..

జెరూసలేం: పాలస్తీనా,ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.రెండు దేశాల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.ఒకరిపై ఒకరు బాంబు దాడులు చేసుకున్నాయి.దీంతో గాజాలో సోమవారం నుంచి ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40 మందికి పైగా పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.మొత్తంగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారు. 2014 తర్వాత ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్, ఇతర ఉగ్ర సంస్థల అధీనంలోని గాజా సిటీ నుంచి పాలస్తీనా మీదకు, పాలస్తీనా నుంచి గాజా సిటీ వైపునకు లెక్కకు మించిన రాకెట్లు దూసుకొస్తున్నాయి. ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా రాకెట్ల వర్షం కురిస్తామని హమాస్‌ కమాండర్లు ప్రకటించిన వీడియో దృశ్యాలను ఇజ్రాయెల్‌ టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారంచేశాయి. కాగా ఇజ్రాయెల్ దాడిలో భారత సంతతికి చెందిన కేరళ మహిళ మృతి చెందింది. ఆమె మృతి పట్ల ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం సంతాపం వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com