భారత్ లో రేపే రంజాన్ పండుగ
- May 13, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో రేపు రంజాన్ పర్వదిన వేడుకలు జరగనున్నాయి.బుధవారం నెలవంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్ ఉపవాసదీక్షను కొనసాగించాలని, 14వ తేదీన ఈద్ జరుపుకోవాలని రువాయత్-ఎ- హిలాల్ కమిటీ, ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్తో పాటు పలువురు మత పెద్దలు ప్రకటించారు.గల్ఫ్ దేశాల్లో రంజాన్ పండుగను గురువారం జరుపుకుంటున్నారు.
దేశంలో గత 30 రోజులుగా ముస్లింలు చేపట్టిన ఉపవాస దీక్షలు నేటి తో ముగియనున్నాయి. ఈ రోజు నెలవంక దర్శనం అనంతరం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు రేపు నిర్వహించనున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే ఒక్క సౌదీ దేశాల్లో మాత్రం ఈ రోజు పండుగను నిర్వహిస్తున్నారు.యూఏఈ,బహ్రెయిన్,ఖతార్,ఒమన్, సౌదీ ఆరేబియా,కువైట్ దేశాల్లో రంజాన్ వేడుకులు గురువారమే జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









