భారత్ లో రేపే రంజాన్ పండుగ

- May 13, 2021 , by Maagulf
భారత్ లో రేపే రంజాన్ పండుగ

న్యూ ఢిల్లీ: భారత్ లో రేపు రంజాన్ పర్వదిన వేడుకలు జరగనున్నాయి.బుధవారం నెలవంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్ ఉపవాసదీక్షను కొనసాగించాలని, 14వ తేదీన ఈద్ జరుపుకోవాలని రువాయత్-ఎ- హిలాల్ కమిటీ, ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్‌తో పాటు పలువురు మత పెద్దలు ప్రకటించారు.గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ పండుగను గురువారం జరుపుకుంటున్నారు.

దేశంలో గత 30 రోజులుగా ముస్లింలు చేపట్టిన ఉపవాస దీక్షలు నేటి తో ముగియనున్నాయి. ఈ రోజు నెలవంక దర్శనం అనంతరం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు రేపు నిర్వహించనున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే ఒక్క సౌదీ దేశాల్లో మాత్రం ఈ రోజు పండుగను నిర్వహిస్తున్నారు.యూఏఈ,బహ్రెయిన్,ఖతార్,ఒమన్, సౌదీ ఆరేబియా,కువైట్ దేశాల్లో రంజాన్‌ వేడుకులు గురువారమే జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com