ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగినవారిని చెప్పుతో కొట్టండి: కేటీఆర్
- March 04, 2016
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బు లు అడిగితే వారిని చెప్పుతో కొట్టాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగం గా వరంగల్, హన్మకొండలో శుక్రవారం నిర్వహించిన రోడ్షోల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న ఇళ్లను చూసి కొందరు పైరవీకారులు సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. ముంబైకి దీటుగా పుణే, బెంగళూర్కు దీటుగా మైసూర్ను అభివృద్ధి చేసినట్లుగానే హైదరాబాద్కు దీటుగా వరంగల్ను శాటిలైట్ నగరంగా అభివృద్ధి చేయడానికి సీఎం కృషి చేస్తున్నారని వివరించారు.
వచ్చే ఐదేళ్లలో రూ. 2 వేల కోట్లతో వరంగల్ నగరాన్ని అభివృద్ధిలో ముందుం చుతామన్నారు.గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధికారంలో ఉన్న గత పాలకులు చేసింది శూన్యమని విమర్శించారు. తెలంగాణ వస్తే చీకట్లేనని మాట్లాడిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డే చీకట్లోకి వెళ్లారని దుయ్యబట్టారు. నీచ రాజకీయూలు చేసే సన్నాసులకు ఓటెస్తారో, గులాబీని ముద్దాడుతారో వరంగల్ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







