దుబాయ్ టిఓఐఎఫ్ఎలో షారుక్, సల్మాన్ సందడి
- March 04, 2016
టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిలిం అవార్డ్స్ సెకెండ్ ఎడిషన్ మార్చ్ 18న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో జరగనుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఈవెంట్లో షారుక్ఖాన్, సల్మాన్ఖాన్, వరుణ్ ధవన్, కరీనాకపూర్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, యోయో హనీ సింగ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు డాన్స్, సింగింగ్ ప్రదర్శనలతో సందడి చేయనున్నారు. స్పెషల్ ప్యానెల్ మరియు, పబ్లిక్ పాపులర్ ఛాయిస్ ద్వారా అవార్డు విజేతల్ని ప్రకటిస్తారు ఈ వేదికపైన. వరుణ్ ధవన్ మాట్లాడుతూ, టిఓఐఎఫ్ తనకు తొలిసారిగా అవకాశం కల్పించిన వేదిక అనీ, బెస్ట్ డిబటెంట్ యాక్టర్ కేటగిరీలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకి అవకాశం దక్కిందని చెప్పాడు. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తామని ఆహూతులకు ఈ సందర్భంగా వరుణ్ భరోసా ఇచ్చాడు. టిఓఐఎఫ్ సెకెండ్ ఎడిషన్లో తానూ భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పంది బాలీవుడ్ భామ జాక్వెలైన్ ఫెర్నాండెజ్. ఇండియా, బహ్రెయన్, కెఎస్ఏ, ఖతార్ ఒమన్ మరియు యూకేకి చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో దుబాయ్కి ఈ కార్యక్రమం కోసం రానున్నారు. తొలి ఎడిషన్ టిఓఐఎఫ్ఎ వాంకోవర్, బ్రిటిష్ కొలంబియా, కెనడాల్లో 40,000 మంది ఆడియన్స్ సమక్షంలో నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ఇవెంట్ ఆర్గనైసర్ గా ఇవెంట్జ్ అన్లిమిటెడ్ వారు వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







