మనోజ్ కుమార్ ను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు ..!!
- March 04, 2016
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోజ్ కుమార్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ థీ, హిమాలయా కీ గోద్ మే, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి వంటి సినిమాలతో మనోజ్ కుమార్ ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు. తన సినిమాల్లో మనోజ్ దేశభక్తిని ఎక్కువగా చూపించేవారు. దేశభక్తి సినిమాల విషయాన్ని తాము ఆయన నుంచే తాము నేర్చుకున్నామని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు ఆయనకు అభినందనలు చెప్పారు.2015 సంవత్సరానికి గాను 47వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మనోజ్కుమార్ను ఎంపిక చేసినట్లు ఎంఐబీ ఇండియా ఓ ట్వీట్ లో తెలిపింది.
సినీ పరిశ్రమ అభివృద్ధికి అద్భుతకృషి చేసినందుకు, ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నందుకు భారత ప్రభుత్వం అందించే ఈ అవార్డుకు ఈ సారి మనోజ్ కుమార్ ఎంపికయ్యారు. ఉపకార్ సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకున్న ఆయన.. 1992 లో భారత ప్రభుత్వం అందిచే పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







