కాబూల్ మసీదులో పేలుడు...12 మంది మృతి
- May 14, 2021
కాబూల్: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ శివార్లలో మసీదులో జరిగిన పేలుడులో 12 మంది మరణించారు.ఈద్ సందర్భంగా శుక్రవారం వీరందరూ ప్రార్ధనలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో పేలుడు సంభవించి 80మంది చనిపోయిన ఘటన జరిగి వారం కూడా తిరగకముందే మసీదులో పేలుడు చోటుచేసుకుంది.రంజాన్ సందర్భంగా మూడు రోజుల పాటు కాల్పుల విరమణను ప్రకటించిన తాలిబన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించకపోవడం గమనార్హం.కాబూల్ పోలీసుల ప్రతినిధి ఫార్మారజ్ మాట్లాడుతూ, మరణించిన వారిలో మసీదు ఇమామ్ కూడా వున్నారని తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని చెప్పారు. పాఠశాలపై దాడి చేసింది ఇస్లామిక్ స్టేట్ వంటి ప్రత్యర్థి మిలిటెంట్ గ్రూపే అయి వుంటుందని అమెరికా భావిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







