కాబూల్ మసీదులో పేలుడు...12 మంది మృతి
- May 14, 2021
కాబూల్: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ శివార్లలో మసీదులో జరిగిన పేలుడులో 12 మంది మరణించారు.ఈద్ సందర్భంగా శుక్రవారం వీరందరూ ప్రార్ధనలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో పేలుడు సంభవించి 80మంది చనిపోయిన ఘటన జరిగి వారం కూడా తిరగకముందే మసీదులో పేలుడు చోటుచేసుకుంది.రంజాన్ సందర్భంగా మూడు రోజుల పాటు కాల్పుల విరమణను ప్రకటించిన తాలిబన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించకపోవడం గమనార్హం.కాబూల్ పోలీసుల ప్రతినిధి ఫార్మారజ్ మాట్లాడుతూ, మరణించిన వారిలో మసీదు ఇమామ్ కూడా వున్నారని తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని చెప్పారు. పాఠశాలపై దాడి చేసింది ఇస్లామిక్ స్టేట్ వంటి ప్రత్యర్థి మిలిటెంట్ గ్రూపే అయి వుంటుందని అమెరికా భావిస్తోంది.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









