కాబూల్‌ మసీదులో పేలుడు...12 మంది మృతి

- May 14, 2021 , by Maagulf
కాబూల్‌ మసీదులో పేలుడు...12 మంది మృతి

కాబూల్‌: ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌ శివార్లలో మసీదులో జరిగిన పేలుడులో 12 మంది మరణించారు.ఈద్‌ సందర్భంగా శుక్రవారం వీరందరూ ప్రార్ధనలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో పేలుడు సంభవించి 80మంది చనిపోయిన ఘటన జరిగి వారం కూడా తిరగకముందే మసీదులో పేలుడు చోటుచేసుకుంది.రంజాన్‌ సందర్భంగా మూడు రోజుల పాటు కాల్పుల విరమణను ప్రకటించిన తాలిబన్‌ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించకపోవడం గమనార్హం.కాబూల్‌ పోలీసుల ప్రతినిధి ఫార్మారజ్‌ మాట్లాడుతూ, మరణించిన వారిలో మసీదు ఇమామ్‌ కూడా వున్నారని తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని చెప్పారు. పాఠశాలపై దాడి చేసింది ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి ప్రత్యర్థి మిలిటెంట్‌ గ్రూపే అయి వుంటుందని అమెరికా భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com