ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- April 06, 2026
దోహా: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీకి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ ఫోన్ చేశారు. సోమవారం జరిగిన ఈ కీలక టెలిఫోన్ సంభాషణలో ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు, వాటి ప్రభావం ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత పై ఎలా పడుతోందనే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఇరు నేతలు ప్రాంతీయ వివాదాలను శాంతియుత మార్గంలో పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.ముఖ్యంగా నౌకాయాన స్వేచ్ఛ (Freedom of Navigation) నిరంతరంగా కొనసాగడం ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలకు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు.
ఖతార్ ప్రధాని అల్ థానీ మాట్లాడుతూ, ఖతార్తో పాటు ప్రాంతంలోని ఇతర దేశాల పై జరుగుతున్న అన్యాయమైన ఇరాన్ దాడులను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా నీరు, ఆహారం, ఇంధన వసతులకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత బాధ్యతారాహిత్య చర్య అని హెచ్చరించారు.
అంతేకాకుండా, సంక్షోభాన్ని అదుపులోకి తెచ్చేందుకు సమన్వయాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి ప్రయత్నాలను ముమ్మరం చేయడం, చర్చల కి తిరిగి రావడం, వివేకం మరియు సంయమనం పాటించడం అవసరమని ఆయన పేర్కొన్నారు.ఈ చర్యల ద్వారా ప్రపంచ ఇంధన భద్రత, నౌకాయాన స్వేచ్ఛ, పర్యావరణ రక్షణతో పాటు ప్రాంతీయ స్థిరత్వం కాపాడవచ్చని అన్నారు.
ఇటీవలి పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం గల్ఫ్ దేశాలతో నిరంతర దౌత్య సంప్రదింపులు కొనసాగిస్తూ, ఇంధన సరఫరాలు మరియు సముద్ర మార్గాల భద్రత పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







