తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు
- May 17, 2021
ప్రసిద్ధ చార్ ధామ్ మందిరాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం సోమవారం తెరుచుకుంది. కఠినమైన కోవిడ్ ప్రోటోకాల్ల మధ్య కేదార్నాథ్ ఆలయ తలుపులు తెల్లవారుజామున తిరిగి తెరిచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. "ఈ రోజు ఉదయం 5 గంటలకు అన్ని ఆచారాలతో కేదార్నాథ్ మందిరం తిరిగి ప్రారంభించబడింది. అందరూ ఆరోగ్యంగా ఉండాలని బాబా కేదార్నాథ్ను ప్రార్థిస్తున్నాను" అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ట్వీట్ చేశారు.
ఈ రోజు కార్యక్రమానికి ఎంపికైన కొద్దిమంది పూజారులు, పరిపాలనా అధికారులు మాత్రమే హాజరయ్యారు. మరో రెండు చార్ ధామ్ పుణ్యక్షేత్రాల ద్వారాలు గంగోత్రి, యమునోత్రి మే 14 న తిరిగి ప్రారంభించబడ్డాయి. కేదార్నాథ్ ఆలయం పరమ శివుడి పుణ్య క్షేత్రం. కరోనావైరస్ మహమ్మారి యొక్క భయంకరమైన సెకండ్ వేవ్ ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ థామ్ యాత్ర తీర్థయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, చార్ థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ ద్వారాలు తెరిచి ప్రతి రోజు పూజాదికాలు మాత్రమే నిర్వహిస్తారు అర్చకులు. యాత్రికులను అనుమతించరు అని ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ తరఫున మొదటి పూజలు జరిగాయని పూజారి తెలిపారు. బద్రీనాథ్ ఆలయం మే 18 న తిరిగి తెరవబడుతుంది.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









