కోవిడ్తో అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షలు
- May 17, 2021
అమరావతి: కరోనా మహమ్మారి ఏకంగా కుటుంబాలను.. కుటుంబాలనే కబలించేస్తోంది.కుటుంబంలోని పెద్దలతో పాటు.. ఈ కుటుంబానికి సర్వం తానై చేసుకునే యువకులను కూడా కోవిడ్ బలితీసుకుంది.తల్లిదండ్రులు కోల్పోయి చాలా మంది చిన్నారులు అనాథులుగా మిగిలిపోతున్నారు.తాము ఉన్నామంటూ చేరదీసేవారు లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే, కోవిడ్ కారణంగా అనాథలైన చిన్నారులకి ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కోవిడ్ తో అనాథలైన చిన్నారుల పేరు పై రూ.10 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిటివ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ మొత్తంపై వచ్చే వడ్డీని ఆ చిన్నారులు నెలనెల తీసుకునే వీలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.ఆ చిన్నారులకు 20 ఏళ్లు నిండిన తర్వాత ఎఫ్డీ మొత్తాన్ని అందించేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపటిలోగా విడుదల చేయనుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









