జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్ పెంపునకు ఆదేశాలు - కేసీఆర్ సర్కార్
- May 18, 2021హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ వేతనాలు పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. గత ఏడాది కరోనా సమయంలో కూడ జూనియర్ డాక్టర్లు కూడ తమ డిమాండ్ల విషయమై నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించింది. కరోనా రెండో వేవ్ సమయంలో కూడ తమ డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు కోరారు.
ఈ విషయమై జూనియర్ డాక్టర్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ డిమాండ్ ను మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హౌస్ సర్జన్, పీజీల స్టైఫండ్ 15 శాతం పెంచాలని కేసీఆర్ హెల్త్ సెక్రటరీకి మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళే ఈ విషయమై జీవోను విడుదల చేయనున్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి