జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్ పెంపునకు ఆదేశాలు - కేసీఆర్ సర్కార్
- May 18, 2021హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ వేతనాలు పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. గత ఏడాది కరోనా సమయంలో కూడ జూనియర్ డాక్టర్లు కూడ తమ డిమాండ్ల విషయమై నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించింది. కరోనా రెండో వేవ్ సమయంలో కూడ తమ డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు కోరారు.
ఈ విషయమై జూనియర్ డాక్టర్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ డిమాండ్ ను మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హౌస్ సర్జన్, పీజీల స్టైఫండ్ 15 శాతం పెంచాలని కేసీఆర్ హెల్త్ సెక్రటరీకి మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళే ఈ విషయమై జీవోను విడుదల చేయనున్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!