జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్ పెంపునకు ఆదేశాలు - కేసీఆర్ సర్కార్

- May 18, 2021 , by Maagulf
జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైఫండ్ పెంపునకు ఆదేశాలు - కేసీఆర్ సర్కార్

హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ వేతనాలు పెంచాలని  జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు  ప్రభుత్వానికి లేఖ రాశారు. గత ఏడాది కరోనా సమయంలో  కూడ జూనియర్  డాక్టర్లు  కూడ తమ డిమాండ్ల విషయమై  నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించింది.  కరోనా రెండో వేవ్ సమయంలో కూడ తమ డిమాండ్లను పరిష్కరించాలని  జూనియర్ డాక్టర్లు కోరారు. 

ఈ విషయమై జూనియర్ డాక్టర్లు  ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ డిమాండ్ ను మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హౌస్ సర్జన్, పీజీల స్టైఫండ్ 15 శాతం పెంచాలని కేసీఆర్ హెల్త్ సెక్రటరీకి మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళే  ఈ విషయమై  జీవోను విడుదల చేయనున్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com