భారత్ కు అండగా ఉంటామంటున్న యూఏఈ

- May 19, 2021 , by Maagulf
భారత్ కు అండగా ఉంటామంటున్న యూఏఈ

యూఏఈ: భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఎటు చూసినా హృదయాన్ని కలచివేసే దృశ్యాలే!..ఇలా ఒక వైపు కరోనా తో పోరాడుతుంటే, తుఫాను 'తౌక్టే' రూపంలో ప్రకృతి కన్నెర్రచేసింది. ఇది దేశంలోని అనేక ప్రాంతాలను తాకి అపారమైన ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టాన్ని సృష్టించింది. ప్రజలు తుఫాను ఉగ్రరూపానికి వణికిపోయారు.

హింసాత్మక "తౌక్టే" తుఫాను బాధితులకు సంఘీభావాన్ని తెలియజేసింది యూఏఈ. భారత ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వటమే కాకుండా బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసింది యూఏఈ విదేశీ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ.

ఇదిలా ఉండగా, కరోనా సెకండ్ వేవ్ లో భారత్ కు ఆక్సిజన్ మరియు ఇతర వైద్య పరికరాలు అందించి, స్నేహభావాన్ని చాటుకుంది యూఏఈ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com