పిల్లలను బిచ్చగాళ్ళగా మార్చుతున్న ముగ్గురు మహిళలకు జైలు, జరిమానా
- May 24, 2021
దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు ముగ్గురు మహిళలకు 5,000 దిర్హాములు (ఒక్కొక్కరికి) జరీమానా అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నిందితులైన మహిళలు, చిన్న పిల్లల్ని బిచ్చమెత్తుకోవడం కోసం వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. ఓ మహిళను నైఫ్ పోలీసులు ఓ కమర్షియల్ సెంటర్ వద్ద అరెస్టు చేశారు. ఓ ఎనిమిదేళ్ళ బాలుడు సమీపంలోని రోడ్లపై బిచ్చమెత్తుకుంటుండగా, అతన్ని పోలీసులు పట్టుకుని ఆరా తీయగా, అతని తల్లి ఆచూకీ తెలిసింది. ఆమెని కూడా అరెస్టు చేశారు. ఆ మహిళ మరో ఇద్దరు అరబ్ మహిళలు, వారి చిన్నారులతో యూఏఈ చేరుకుని, బిచ్చగాళ్ళలా మారినట్లు విచారణలో గుర్తించారు. మొదటి నిందితురాలి అరెస్టుతో మిగతా ఇద్దరి ఆచూకీ దొరికింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మిగిలిన ఇద్దరు మహిళల్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







