పిల్లలను బిచ్చగాళ్ళగా మార్చుతున్న ముగ్గురు మహిళలకు జైలు, జరిమానా
- May 24, 2021
దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు ముగ్గురు మహిళలకు 5,000 దిర్హాములు (ఒక్కొక్కరికి) జరీమానా అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నిందితులైన మహిళలు, చిన్న పిల్లల్ని బిచ్చమెత్తుకోవడం కోసం వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. ఓ మహిళను నైఫ్ పోలీసులు ఓ కమర్షియల్ సెంటర్ వద్ద అరెస్టు చేశారు. ఓ ఎనిమిదేళ్ళ బాలుడు సమీపంలోని రోడ్లపై బిచ్చమెత్తుకుంటుండగా, అతన్ని పోలీసులు పట్టుకుని ఆరా తీయగా, అతని తల్లి ఆచూకీ తెలిసింది. ఆమెని కూడా అరెస్టు చేశారు. ఆ మహిళ మరో ఇద్దరు అరబ్ మహిళలు, వారి చిన్నారులతో యూఏఈ చేరుకుని, బిచ్చగాళ్ళలా మారినట్లు విచారణలో గుర్తించారు. మొదటి నిందితురాలి అరెస్టుతో మిగతా ఇద్దరి ఆచూకీ దొరికింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మిగిలిన ఇద్దరు మహిళల్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









