పిల్లలను బిచ్చగాళ్ళగా మార్చుతున్న ముగ్గురు మహిళలకు జైలు, జరిమానా
- May 24, 2021
దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు ముగ్గురు మహిళలకు 5,000 దిర్హాములు (ఒక్కొక్కరికి) జరీమానా అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నిందితులైన మహిళలు, చిన్న పిల్లల్ని బిచ్చమెత్తుకోవడం కోసం వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. ఓ మహిళను నైఫ్ పోలీసులు ఓ కమర్షియల్ సెంటర్ వద్ద అరెస్టు చేశారు. ఓ ఎనిమిదేళ్ళ బాలుడు సమీపంలోని రోడ్లపై బిచ్చమెత్తుకుంటుండగా, అతన్ని పోలీసులు పట్టుకుని ఆరా తీయగా, అతని తల్లి ఆచూకీ తెలిసింది. ఆమెని కూడా అరెస్టు చేశారు. ఆ మహిళ మరో ఇద్దరు అరబ్ మహిళలు, వారి చిన్నారులతో యూఏఈ చేరుకుని, బిచ్చగాళ్ళలా మారినట్లు విచారణలో గుర్తించారు. మొదటి నిందితురాలి అరెస్టుతో మిగతా ఇద్దరి ఆచూకీ దొరికింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మిగిలిన ఇద్దరు మహిళల్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







