జూన్ 1 నుంచి బహిరంగ ప్రాంతాల్లో పగటి పనివేళలు బంద్
- May 25, 2021
కువైట్: జూన్ 1 నుంచి పగటి వేళలల్లో బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించే పనులపై నిషేధం విధిస్తూ కువైట్ ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలపై నిషేధం అమలులో ఉండనుంది. వేసవి ఎండల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేందుకు ప్రతి యేడాది వేసవిలో నేరుగా ఎండతాకేలా బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించే పనుల విషయంలో పని సమయాల్లో మార్పులు చేయటం సాధారణ విషయమే. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్ట్ వరకు నిబంధనలను అమలు చేయనుంది కువైట్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ. అయితే..ఎవరైనా యజమానులు, నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేందుకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







