జూన్ 1 నుంచి బహిరంగ ప్రాంతాల్లో పగటి పనివేళలు బంద్
- May 25, 2021
కువైట్: జూన్ 1 నుంచి పగటి వేళలల్లో బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించే పనులపై నిషేధం విధిస్తూ కువైట్ ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలపై నిషేధం అమలులో ఉండనుంది. వేసవి ఎండల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేందుకు ప్రతి యేడాది వేసవిలో నేరుగా ఎండతాకేలా బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించే పనుల విషయంలో పని సమయాల్లో మార్పులు చేయటం సాధారణ విషయమే. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్ట్ వరకు నిబంధనలను అమలు చేయనుంది కువైట్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ. అయితే..ఎవరైనా యజమానులు, నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేందుకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









