జూన్ 1 నుంచి బహిరంగ ప్రాంతాల్లో పగటి పనివేళలు బంద్
- May 25, 2021
కువైట్: జూన్ 1 నుంచి పగటి వేళలల్లో బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించే పనులపై నిషేధం విధిస్తూ కువైట్ ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలపై నిషేధం అమలులో ఉండనుంది. వేసవి ఎండల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేందుకు ప్రతి యేడాది వేసవిలో నేరుగా ఎండతాకేలా బహిరంగ ప్రాంతాల్లో నిర్వహించే పనుల విషయంలో పని సమయాల్లో మార్పులు చేయటం సాధారణ విషయమే. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్ట్ వరకు నిబంధనలను అమలు చేయనుంది కువైట్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ. అయితే..ఎవరైనా యజమానులు, నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేందుకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







