రిస్కు గ్రూపులో వున్నవారు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలన్న సౌదీ

- May 26, 2021 , by Maagulf
రిస్కు గ్రూపులో వున్నవారు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలన్న సౌదీ

సౌదీ అరేబియా: రిస్కు గ్రూపుకి చెందిన వృద్ధులు అలాగే దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడ్డవారు, కొన్ని ప్రత్యేక వ్యాధులతో సతమతమవుతున్నవారు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సి వుంటుంది. తద్వారా వారిలో కరోనా వల్ల సంభవించే సమస్యల తీవ్రత తగ్గుతుంది. పైన పేర్కొన్న గ్రూపులకు చెందినవారు వ్యాక్సిన్ తీసుకోనట్లయితే, వారు ప్రమాదకర పరిస్థితుల్లోకి తమను తాము నెట్టివేసుకున్నట్లవుతుంది కరోనా కారణంగా. వ్యాక్సిన్ల ద్వారా ఇమ్యూనిటీ పొందినవారితో పోల్చితే, వ్యాక్సిన్ పొందని వృద్ధుల్లో మరణాల శాతం 78కి పైగా వుందని గణాంకాలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com