గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రత

- March 05, 2016 , by Maagulf
గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రత

పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతంలోనూ, కచ్ జిల్లాలోనూ మరింత భద్రతను పెంచింది. పాక్ భూభాగం లేదా సముద్ర మార్గం ద్వారా 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు చొరబడే ప్రమాదముందని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ గుజరాత్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. కచ్ తీర ప్రాంతంలో గత మూడు నెలల కాలంలో పాక్ నుంచి అక్రమంగా చొచ్చుకొచ్చిన ఐదు మత్స్యకారుల పడవలను భారత భద్రత అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి భద్రత బలగాలు కేంద్రానికి నివేదిక సమర్పించాయి. అజిత్ దోవల్ సూచన మేరక రాష్ట్రంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని ఓ అధికారి చెప్పారు.గుజరాత్ అదనపు ప్రధాన కార్యదర్శి పీకే తనేజా శనివారం పోలీసు, రక్షణ, ఐబీ, పారామిలటరీ బలగాల అధికారులతో సమావేశమయ్యారు. ఇదిలావుండగా రాష్ట్రంలోకి పది మంది ఉగ్రవాదులు చొరబడినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెండు ఎన్ఎస్ జీ బృందాలు గుజరాత్ కు చేరుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com