భారత్ లో అందుబాటులోకి రానున్న ఫైజర్ వ్యాక్సిన్
- May 27, 2021
న్యూ ఢిల్లీ: ఫైజర్ వ్యాక్సిన్ భారత్ లో త్వరలో అందుబాటులోకి వచ్చే సూచనలున్నాయని ఈ సంస్థ తెలిపింది.అత్యంత నాణ్యమైన ఈ వ్యాక్సిన్ ను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని, 12 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తీ ఈ వ్యాక్సిన్ ని వాడవచ్చునని పేర్కొంది. 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య దీన్ని నెల రోజులపాటు నిల్వ ఉంచవచ్చునని ఈ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. జులై–అక్టోబర్ మధ్య కాలంలో 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పారు.అయితే ఐడెంటిఫికేషన్ సహా ఇతర రెగ్యులేటరీ సడలింపులను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఇటీవల కొన్నివారాలుగా భారత అధికారులకు, ఈ సంస్థ ప్రతినిధులకు మధ్య సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయి.ఈ చర్చలో ఈ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా కూడా పాల్గొన్నారు. అత్యవసర వినియోగానికి తమ వ్యాక్సిన్ ను ఇండియాకు అందజేయాలంటే సత్వర ఆమోదాలు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. ఇండియాలోను, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదివరకటి మాదిరి పరిస్థితి సజావుగా లేదని, అందువల్ల కోవిద్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవల్ సహా అధికారికంగా తమకు 44 అనుమతులు రావాల్సి ఉందని, కానీ పోస్ట్ అప్రూవల్ కమిటీ పర్మిషన్ అవసరం లేదని ఆల్బర్ట్ పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో ఫైజర్ వ్యాక్సిన్ ని వినియోగిస్తున్నారు.
చవకైనదైన ఈ వ్యాక్సిన్ ను ఫ్రిజ్ లో నెల రోజుల పాటు 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచవచ్చునని ఇదివరకే వార్తలు వచ్చాయి.వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్న ఇండియాకు ఈ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని కోట్లాది మంది ఎదురు చుస్తునారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







