ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం
- May 27, 2021
అమరావతి: మందు తయారీ, పంపిణీపై జోక్యం చేసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య గురువారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ నిర్వహించనుంది హైకోర్టు.దాదాపు ఐదు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. మందుకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన రెండు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది. మరోవైపు ఆనందయ్య కూడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్ గా ఉన్నట్టుగా ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. కరోనాపై సంప్రదాయ ఆయుర్వేద వైద్యం చేస్తున్నట్టుగా చెప్పారు. మందు తయారీ, పంపిణీలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఆయుష్ కమిషనర్ ను చేర్చారు. ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ చేపట్టనుంది హైకోర్టు.ఆనందయ్య మందు ఉపయోగించిన రోగుల నుండి సేకరించిన సమాచారాన్ని సీసీఆర్ఏఎస్ కు ఆయుర్వేద వైద్యులు పంపారు. ఢిల్లీలోని జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఈ విషయమై ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







